కోల్కతా, ఏప్రిల్ 2: పశ్చిమబెంగాల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. హుగ్లీలో బీజేపీ ఆదివారం చేపట్టిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ చోటుచేసుకొన్నది.రాళ్ల దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. సీఎం మమత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేసింది. గత గురువారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా హౌరాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. కాగా, శ్రీరామనవమి రోజున జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో బీహార్లోని నలంద జిల్లాలో ప్రకటించిన ఇంటర్నెట్ రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4 వరకు పొడిగించింది.
శ్రీరామనవమి పండుగ సందర్భంగా హింసాకాండ చోటుచేసుకున్న మూడు రాష్ర్టాలూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత సవాల్గా మారిన రాష్ర్టాలే. అవి మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్. దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?
-రాజ్దీప్ సర్దేశాయ్, ప్రముఖ జర్నలిస్ట్