న్యూఢిల్లీ: సీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవడం, విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధనకు సెప్టెంబర్ 5న ఢిల్లీలో మార్చ్ నిర్వహించనున్నామని, ఈ నిరసనలో పాల్గొనాలని సీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నీట్ పేపర్ లీక్, పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ సీజేపీ జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టింది.