Justice Sanjiv Khanna | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
2022 డిసెంబర్ 17న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్.. నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సూచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం సీజేఐకి లేఖరాసింది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రస్తుతం అత్యంత సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా పేరును సీజేఐ సూచించినట్టు సమాచారం.