న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేసుల విచారణ నిమిత్తం సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, పిటిషనర్లు, మధ్యవర్తులు, ఇతరులకు అవసరమైన పాసులు ఇచ్చేందుకు కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ-పాస్ల జారీకి ‘సుస్వాగతం’ అనే ఆన్లైన్ పోర్టల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు.
‘సుస్వాగతం అనేది వెబ్, మొబైల్ ఆధారిత అప్లికేషన్. ఈ పోర్టల్ ద్వారా కోర్టుకు విచారణకు హాజరయ్యేవారు, న్యాయవాదులను కలిసేందుకు వచ్చేవారు ఈ పాస్ల కోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు’ అని సీజేఐ వెల్లడించారు.