Civil Services | హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ను నిర్వహించగా, ఈ రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. సుమారుగా 15వేలకు పైగా అభ్యర్థులు ఎంపిక కాగా, ఆయా అభ్యర్థుల హాల్టికెట్లను యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. కేటగిరిల వారిగా ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన వారి హాల్టికెట్ నెంబర్లను ప్రకటించింది. వీరికి త్వరలోనే ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఫలితాలను వెల్లడించనున్నారు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి.