న్యూఢిల్లీ: అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన ఐదుగురు మరణించారు. వీరిని తీసుకెళ్లిన మినీ జలాంతర్గామి కుప్పకూలి ముక్కలైందని అమెరికా కోస్ట్గార్డ్ ప్రకటించింది.
టైటానిక్ శకలాలకు 1,600 అడుగుల దూరంలో దాని ఆనవాళ్లను గుర్తించామని వెల్లడించింది. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల జలాంతర్గామి ప్రెజర్ చాంబర్ పూర్తిగా దెబ్బతిన్నదని, సముద్రం ఒత్తిడిని తట్టుకోలేక కుప్పకూలిపోయిందని తెలిపింది.