జైపూర్: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి పంజా విసురుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. రాజస్థాన్లోని చురులో పగటి ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. ఇవాళ అక్కడ -0.5 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఈ శీతాకాలంలో ఇదే అత్యంత చలిరోజుగా రికార్డుల్లోకి ఎక్కింది.
చురులో గత రెండుమూడు రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తున్నది. దాంతో ఇండ్ల మీద, చెట్ల మీద, వాహనాల మీద, రోడ్ల మీద మంచు పేరుకుపోయింది. దాంతో జనం ఇళ్లలోనే చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చురులో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. వేసవిలో అన్ని ప్రాంతాలకంటే ఎక్కువగా 50 డిగ్రీ సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.