న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తహీర్పూర్ ప్రాంతంలో ఓ చర్చిలో (church vandalised) ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో చొచ్చుకువచ్చిన దుండగులు విధ్వంసం సృష్టించారు. జియోన్ ప్రార్ధనా మందిరంలోకి ప్రవేశించిన ఓ వర్గానికి చెందిన వ్యక్తులు చర్చ్ను ధ్వంసం చేయడంతో పాటు ప్రార్ధనా మందిరం లోపల నినాదాలు చేశారు.
దుండగులపై జీటీబీ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సమయంలోనూ కొందరు నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
చర్చ్ సమీపంలోని సీసీటీవీ ఫుట్జ్ సాయంతో ఇతర నిందితులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా చర్చి పరిసర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు.
Read More :