న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల చైనా వీసా కుంభకోణం కేసులో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ముందస్తు బెయిల్కు కోసం పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై సోమవారం విచార ణ జరిగే అవకాశం ఉన్నది.
సీబీఐ కోర్టులో పిటిషన్పై విచారణ సందర్భంగా వీసాల కుంభకోణంలో కార్తీకి బెయిల్ మంజూరైతే, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో కనిపెట్టలేమని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ముందస్తు బెయిల్ మంజూరైతే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నది. ప్రస్తుతం విచారణ మాత్రమే ప్రారంభిచామని తెలిపింది. కేసులో నిర్ధారణ వచ్చే వరకు అరెస్టు చేయమని చెప్పింది. 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పించేందుకు తన సహచరుడి ద్వారా పంజాబ్కు చెందిన ఓ సంస్థ నుంచి రూ.50 లక్షలు లంచం అందుకున్నట్లు సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ ఇటీవల మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.