China | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. భారత్తోపాటు అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపై కూడా ప్రయోగించొచ్చని తెలిపింది. అయితే అలాంటి కంటెంట్ ఎన్నికల ఫలితాలపై చూపే ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, అటువంటి మీమ్లు, ఆడియోలు, వీడియోలను చైనా కొనసాగిస్తుందని అభిప్రాయపడింది.
చైనా ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్ను వ్యాప్తి చేయించిందని తెలిపింది. ఈ విధంగా విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్ను వినియోగించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నది.