న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత కార్యకలాపాలపై మన పొరుగున ఉండే చైనా ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. తాజాగా భారత ఆర్మీపై ప్రధానంగా అందులోని గోర్ఖా రెజిమెంట్స్పై డ్రాగన్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. నేపాల్ యువకులు భారత ఆర్మీలోని ఈ రెజిమెంట్లలో ఎందుకు చేరుతున్నారనే విషయంపై పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు నేపాల్లోనే ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
భారత ఆర్మీలోకి ఎందుకు వెళ్తున్నారు, ప్రధానంగా ఆర్థికపరంగా వారు ఆశిస్తున్నది ఏంటి? ఇతర అంశాలపై అధ్యయనం చేసే పనిని ఆ గ్రూపునకు అప్పగించింది. ఈ బృందానికి నేపాల్ రాజధాని ఖాట్మండూలోని చైనీస్ స్టడీ సెంటర్ ఫండింగ్ చేస్తున్నట్టు సమాచారం. భారత ఆర్మీలో ప్రస్తుతం ఏడు గోర్ఖా రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతిదానిలో ఐదారు బెటాలియన్లతో దాదాపు 40 వేల మంది సైనికులు ఉన్నారు.
దాదాపు 3 కోట్ల మంది జనాభా ఉండే నేపాల్లో చైనీస్ స్టడీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇప్పటికే 32 ఉన్న సెంటర్లను ప్రతి జిల్లాల్లో ఒక్కటి చొప్పున 77కి విస్తరించాలని, ఆ తర్వాత ఇంకా పెంచాలని చైనా ప్రణాళికలు వేసుకొన్నది. చైనా పలు ప్రాజెక్టులో ఫండింగ్ పేరుతో నేపాల్కు దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నిస్తున్నది.
on the!