China | అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చడాన్ని డ్రాగన్ గట్టిగా సమర్థించుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ… టిబెట్కు దక్షిణాన ఉన్న ప్రాంతం చైనాలో అంతర్భాగమని, అది చైనా భూభాగం కిందికే వస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో విభిన్న జాతుల వారు చాలా సంవత్సరాలుగా ఉంటున్నారని, వీరే ఈ ప్రాంతాన్ని రక రకాల పేర్లతో పిలుచుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే చైనా కేబినెట్ నిర్ణయం ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారాయని గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక పేర్కొనడం గమనించాల్సిన అంశం.
అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాల పేర్లను చైనా ప్రభుత్వం మార్చేసింది. పైగా ఆ పేర్లనే ఖాయం చేసుకున్నామని కూడా ప్రకటించింది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ తేల్చి చెప్పారు. చైనా తన మ్యాపులో ఈ ప్రాంతాల పేర్లను మార్చినంత మాత్రాన, అవి భారత్లో అంతర్భాగం కాకుండా పోవని ఆయన చురకలంటించారు.