భోపాల్: మద్యం ఫ్యాక్టరీలో పిల్లలు పని చేస్తున్నట్లు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మద్యం తయారీ సంస్థపై రైడ్ చేశారు. సుమారు 50 మంది పిల్లలను రక్షించారు. (Children Rescued) అయితే ఆ తర్వాత ఆ పిల్లలు అక్కడి నుంచి మాయమయ్యారు. మధ్యప్రదేశ్లోని రైసిన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెహత్గంజ్లోని సోమ్ డిస్టిలరీస్, బ్రూవరీస్లో బాల కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో తెలిపారు. శనివారం తమ బృందంతో కలిసి అక్కడ రైడ్ చేసినట్లు చెప్పారు. సుమారు 50 మంది బాల, బాలికలను రక్షించినట్లు వెల్లడించారు.
కాగా, పిల్లలను స్కూల్ బస్సులో మద్యం ఫ్యాక్టరీకి తరలించి పనులు చేయిస్తున్నట్లు తమకు తెలిసిందని ప్రియాంక్ కనుంగో తెలిపారు. రసాయనాల వల్ల పిల్లల చేతులు పాడయ్యాయని అన్నారు. రక్షించిన పిల్లలను అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ పిల్లలు మద్యం ఫ్యాక్టరీ నుంచి మాయమయ్యారని ఎన్సీపీసీఆర్ చైర్మన్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో పేర్కొన్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ రైడ్పై స్పందించారు. కార్మిక, ఎక్సైజ్, పోలీసు శాఖల నుంచి పూర్తి సమాచారాన్ని కోరినట్లు తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్లో పేర్కొన్నారు.
शर्मनाक तस्वीर !!!
भोपाल के नज़दीक सोम डिस्टिलरी की ये तस्वीर बता रही है कि MP के आबकारी विभाग ने अपनी आंखें क्यों मूंद रखी हैं..50 नाबालिग बच्चे 20 लड़कियों समेत शराब बनवाने के काम में लगे थे,उसी परिसर में आबकारी का दफ्तर भी था..@DrMohanYadav51 जी छोड़िएगा नहीं इन लोगों को. pic.twitter.com/i3XVr0cH5V
— Naveen Singh (@Naveen_K_Singh_) June 15, 2024
रायसेन जिले में फैक्ट्री पर छापे के दौरान बालश्रम का मामला मेरे संज्ञान में आया है।
यह मामला बेहद गंभीर है। इस संबंध में श्रम, आबकारी और पुलिस विभाग के अधिकारियों से विस्तृत जानकारी प्राप्त की है और समुचित कार्रवाई के निर्देश दिए हैं। दोषियों के विरुद्ध कड़ी से कड़ी कार्रवाई की…
— Chief Minister, MP (@CMMadhyaPradesh) June 15, 2024