UP Schools | లక్నో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పురుగులతో ఉన్న భోజనం వడ్డించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సంబల్ జిల్లా ఆదంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పురుగులతో ఉన్న ఆహారాన్ని వడ్డించారు. దీంతో విద్యార్థులు ఆ ఆహారాన్ని తినడానికి తిరస్కరించి సమస్యను స్కూల్ యాజమాన్యం దృష్టికి తెచ్చారు.
అయితే వారు చర్యలు తీసుకోకపోగా, ఆ విషయాన్ని గప్చుప్ చేయడానికి ప్రయత్నించడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళన చేసి జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడంతో ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. స్కూల్కు చేరుకున్న ఉన్నతాధికారులు ఆహారం శ్యాంపిల్స్ను సేకరించి పరీక్షకు పంపారు. ఈ నిర్లక్ష్య ఘటనకు బాధ్యులను చేస్తూ స్కూల్ కేటరర్లను, అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.