న్యూఢిల్లీ : తల్లిదండ్రుల అమాయకత్వం, మూఢ నమ్మకాలకు ఐదేళ్ల బాలుడు బలైపోయాడు. ఢిల్లీ పోలీస్ సూపరింటెండెంట్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం… బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నాడు. అతనిని సర్ గంగారామ్ దవాఖానకు చికిత్స కోసం తీసుకెళ్లారు. వైద్యులు ప్రయోజనం లేదని చెప్పారు. గంగా నదిలో పవిత్ర స్నానం చేయిస్తే, వ్యాధి నయమవుతుందని విశ్వసించారు. న్యూఢిల్లీ నుంచి బాలుడితోపాటు తల్లిదండ్రులు, మరొక వ్యక్తి హరిద్వార్లోని గంగా నది వద్దకు బుధవారం వచ్చారు.
అందరూ చూస్తుండగానే ఆ బాలుడిని పదే పదే నదిలో ముంచారు. దీంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనను చూసినవారు ఆ తల్లిదండ్రులను మందలించారు. అయితే ఆ బాలుని శవం వద్ద ఉన్న అతని తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు లేచి, నిల్చుంటాడని చెప్పారు. కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడిని ఓ దవాఖానకు తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.