న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు. కుటుంబ సమేతంగా వచ్చిన వీరంతా గార్డెన్లో కలియదిరిగారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆహ్వానం మేరకు వచ్చిన వీరంతా గార్డెన్ అందాలను చూసి పులకించిపోయారు. ఈ సందర్భంగా సీజేఐ రమణ వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందజేశారు.