న్యూఢిల్లీ: లోక్సభతో పాటు కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎలక్టోరల్(ఎన్నికల) బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
శనివారం భువనేశ్వర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నట్టు చెప్పారు. ఈవీఎంలు లేకుండా ఎన్నికల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నదని, తీర్పు వచ్చాక, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.