న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ (Delhi Services Bill )బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు పలకడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు. ఈ బిల్లులో మంచి విషయం వారికి ఏం కనిపించిందో తనకు అర్ధం కాలేదని అన్నారు.
ఢిల్లీ సర్వీసెస్ అధారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతివ్వడాన్ని తాను అర్ధం చేసుకోగలనని, కానీ ఈ బిల్లులో వైసీపీ, బీజేడీలకు ఏం గొప్పతనం కనిపించిందో తనకు అర్ధం కావడం లేదని ట్విట్టర్ వేదికగా చిదంబరం ఆ రెండు పార్టీలను ప్రశ్నించారు. సీఎంతో పాటు కమిటీలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అధికారులను నియమించిన త్రిసభ్య అధారిటీలో వైసీపీ, బీజేడీలకు ఏం నచ్చిందని చిదంబరం నిలదీశారు.
సీఎం లేకుండానే ఇద్దరు అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించే నిబంధన ఈ పార్టీలకు మంచిదిగా కనిపించిందా అని ప్రశ్నించారు. సీఎంను పక్కనపెట్టే ఈ చట్టానికి మీరు అనుకూలమా అని నిలదీశారు. అథారిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని కూడా ఎల్జీ తోసిపుచ్చే అధికారం ఈ పార్టీలకు అద్భుతంగా అనిపించిందా అని చిదంబరం ప్రశ్నించారు.
Read More :