రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ జిల్లా కొండగావ్ తహసీల్లోని బోర్గావ్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నదని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.