Sukma Encounter | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సలైట్లు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన 165వ బెటాలియన్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి వీరమరణం పొందారు. మరో కానిస్టేబుల్ రాముకు గాలయ్యాయి. గాయపడ్డ రాముకు ప్రథమి చికిత్స అందించి.. చికిత్స నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. ఇదిలా ఉండగా.. నలుగురు అనుమానితులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
సంఘటనా స్థలంలో సీఆర్పీఎఫ్, కోబ్రా, జిల్లా పోలీస్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సుక్మా జిల్లా జాగర్గుండలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్కు చెందిన మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నివాళులర్పించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్ రాముకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.