రాయ్పూర్: గర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు తరచూ మద్యం సేవించి తన భార్యతో గొడవ పెట్టుకొని ఆమెను కొట్టేవాడు. ఇదే విధంగా గత వారం గొడవ పెట్టుకొని మూడు నెలల గర్భిణి అయిన తన భార్య ప్రైవేట్ పార్ట్లోకి హాక్సా బ్లేడ్ చొప్పించాడు.
అయితే తన భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడిందని చెప్పి దవాఖానకు తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించగానే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి ప్రైవేట్ పార్ట్ నుంచి 10 అంగుళాల పొడవైన ఇనుప కడ్డీ లాంటి వస్తువును వెలికి తీశామని శవ పరీక్ష చేసిన వైద్యులు తెలిపారు. నిందితుడిని గత ఆదివారం అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు.