న్యూఢిల్లీ : బీజేపీ, సంఘ్ పరివార్పై చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ-నెహ్రూ కుటుంబాలు దేశం కోసం చేసిన త్యాగాల గురించి ప్రపంచమంతా తెలుసని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆరెస్సెస్లు గాడ్సే భక్తులని ఆయన అభివర్ణించారు.
గాడ్సే, వీర్సావర్కర్ల పట్ల విశ్వాసం కనబరిచే వారి నుంచి తమకు సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటిషర్ల పాదాలు తాకిన వారు ఇప్పుడు తమను ప్రశ్నిస్తున్నారని ఆయన కాషాయ పార్టీ తీరును ఆక్షేపించారు.