రాయ్పూర్ : ఛత్తీస్గఢ్కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ ఆఫీసర్ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ వద్ద డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
గతేడాది జూన్లో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో దాదాపు రూ. 100 కోట్లకు పైగా హవాలా రాకెట్ను గుర్తించారు అధికారులు. అయితే పెద్దఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారిందని పేర్కొన్నారు. సౌమ్య చౌరాసియా నివాసంలోనూ 2020, ఫిబ్రవరిలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకే కేంద్రం ఈడీ, ఐటీలను రాష్ట్రాలపై ప్రయోగిస్తుందని సీఎం భూపేశ్ భగేల్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతుందని ఆయన తెలిపారు.