Manoj Singh Mandavi | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి(58) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్లో శనివారం రాత్రి అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన్ని వెంటనే చరమలోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ధామ్తరి పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కంకేర్ జిల్లాలోని భానుప్రతాప్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాండవి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000- 2003 వరకు అజిత్జోగి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. మాండవి మృతికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బూపేస్ బాగెల్, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.