బౌల్డర్: ప్రస్తుతం పెరుగుతున్న రీతిలోనే సముద్ర మట్టాలు పెరిగితే 2100 నాటికి చెన్నై, కోల్కతా నగరాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది. సమాజం గ్రీన్హౌస్ వాయువులను ఇప్పుడున్న విధంగానే ఎక్కువగా విడుదల చేస్తే సముద్ర మట్టాల్లో సహజంగా ఏర్పడే ఒడిదొడుకులపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ అధ్యయనం నేచర్ ైక్లెమెట్ చేంజ్ జర్నల్లో ప్రచురితమైంది. ‘పరిస్థితులు విషమించినప్పుడు వాతావరణ మార్పులు, స్థానిక సముద్ర మట్టాలను 50 శాతం పెంచుతాయి.’ అని శాస్త్రవేత్త ఎక్స్యూ వెల్లడించారు.