న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ మాజీ సీఈవోకు చెన్నై కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. పాల్పప్ ఇచినిచ్ సాఫ్ట్వేర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ మాసీ సీఈవో పీ సెంథిల్ కుమార్.. బ్యాంక్ ఫ్రాడ్కు(Bank Fraud Case) పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2.06 కోట్ల నష్టం వచ్చే విధంగా సెంథిల్ వ్యవహరించినట్లు ప్రత్యేక సీబీఐ కోర్టు తన తీర్పులో చెప్పింది. ఇక ఆ మాజీ సీఈవోతో పాటు మరో ముగ్గురికి సుమారు 2.10 కోట్ల జరిమానా కూడా విధించింది.
2008లో సీబీఐ ఈ కేసును టేకప్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును విచారించారు. స్టార్ పర్సనల్ లోన్ స్కీమ్ కింద సెంథిల్ కుమార్ సుమారు 149 లోన్ అకౌంట్లను క్రియేట్ చేశాడు. చెన్నైలోని అన్నా సలై బ్రాంచీలో ఆ అకౌంట్లను ఆయన ఓపెన్ చేశారు. డమ్మీ వ్యక్తుల పేర్లతో ఆ ఖాతాలు తెరిచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సాలరీ స్లిప్లను ఫ్యాబ్రికేట్ చేసి, లబ్ధిదారుల పేర్లతో ఫేక్ ఐడీ కార్డులను సృష్టించి అక్రమ రీతిలో లోన్లు తీసుకున్నాడు.
స్పెషల్ జడ్జి ఆర్ గిరిజా రాణి.. ఇవాళ తన తీర్పులో సెంథిల్ కుమార్కు అయిదేళ్ల కఠిన శిక్ష వేసింది. ఆ వ్యక్తికి 2 కోట్ల ఫైన్ కూడా వేసినట్లు సీబీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎస్ కాళిదాసన్, తంజన్ చెజినారేలకు 5 ఏళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు.