చెన్నై: ఒక బ్యాంక్ మేనేజర్ వర్షంలో సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ట్రాఫిక్లో చిక్కుకున్న మూడు అంబులెన్స్లకు దారి ఏర్పాటు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం అక్కడ భారీగా వర్షం కురింది. దీంతో జనజీవనం స్తంభించడంతోపాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మూడు అంబులెన్స్లు అన్నా సలై రోడ్డులోని ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. పరిస్థితి సీరియస్గా ఉన్న రోగులను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి అవి తీసుకెళ్తున్నాయి. ట్రాఫిక్ జామ్ వల్ల ముందుకు వెళ్లే మార్గం లేక అంబులెన్స్ డ్రైవర్లకు ఏం చేయాలో తెలియక సైరన్లు మోగిస్తున్నారు.
కాగా, బైక్పై వెళ్తున్న ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ జిన్నా ట్రాఫిక్లో చిక్కుకున్న మూడు అంబులెన్స్ల పరిస్థితిని గమనించారు. వాటిలోని రోగులను ఆసుపత్రికి చేర్చేందుకు ఏదో ఒకటి చేయాలని ఆయన నిర్ణయించారు. వెంటనే తన బైక్ను ఒక చోట పార్క్ చేశారు. అంబులెన్స్ల ముందుకు వెళ్లి వాటికి దారి ఏర్పాటు చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయక సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్లకు దారి చూపారు.
బ్యాంక్ మేనేజర్ జిన్నా మానవత్వంతో చూపిన చొరవ వల్ల మూడు అంబులెన్స్లోని రోగులు సకాలంలో ఆసుపత్రికి చేరగలిగారు. ఒక వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బ్యాంక్ మేనేజర్ జిన్నా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.