చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ రేటును సవరించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ధర రూ.200 మేర తగ్గించారు. గతంలో రూ.900 ఉండగా ప్రస్తుతం రూ.700 వసూలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు జరిపే అంతర్జాతీయ ప్రయాణీకులు http://tinyurl.com/PATAAI లింక్ని ఉపయోగించి లేదా QR యాక్సెస్ ద్వారా కోవిడ్ టెస్ట్ స్లాట్ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. 01.12.2021 నుంచి ఆర్టీ-పీసీఆర్ ఛార్జీలు @HllHindlabs రూ.700’ అని చెన్నై విమానాశ్రయం ఒక ట్వీట్లో పేర్కొంది.