బోఫాల్, మే 23: మధ్యప్రదేశ్లోని కునో పార్కులో మరో చీతా మృత్యువాత పడింది. రెండు నెలల క్రితం పార్కులో నమీబీయా చీతా జ్వాలకు జన్మించిన నాలుగు కూనల్లో ఒకటి మంగళవారం చనిపోయింది.
బలహీనత కారణంగానే చీతా కూన చనిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. అనారోగ్యంతో ఉన్నట్టు గుర్తించిన ఆ చీతా కూనకు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.