Chardham Yatra 2024 | చార్దామ్ యాత్ర-2024లో భాగంగా బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ద్వారాలను తెరిచే కార్యక్రమానికి ఆదివారం అంకురార్పణ జరిగింది. జోషిమఠ్లోని నారసింహ ఆలయంలో పూజల అనంతరం యోగ బద్రీ పాండుకేశ్వర్కు బయలుదేరారు. పాండుగేశ్వర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ ఘనస్వాగతం పలికారు. నరేంద్రనగర్లోని రాజదర్బార్లో వసంత పంచమి రోజున (ఫిబ్రవరి 14) రోజున బద్రీనాథ్ ధామ్ తలుపులను తెరిచేందుకు తేదీని నిర్ణయించనున్నారు. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మాట్లాడుతూ బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవడానికి సన్నాహాలు మొదలయ్యాయని తెలిపారు.
ఫిబ్రవరి 14న ఉదయం 10 గంటల నుంచి ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అదేరోజున తెల్ కలష్ యాత్ర తేదీని సైతం నిర్ణయించున్నారు. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను తెరిచే తేదీని త్వరలోనే నిర్ణయించనున్నారు. పంచాంగం ప్రకారం.. ఆలయ ద్వారాలను తెరిచేందుకు శుభ ముహూర్తం నిర్ణయించిన అనంతరం భోగమూర్తి కేదార్నాథ్ ధామ్కు బయలుదేరే షెడ్యూల్ను నిర్ణయించనున్నారు. ఇక అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ నెలలో ఆలయ కమిటీ తలుపులు తెరిచే తేదీని అధికారికంగా ప్రకటించనున్నది.