చండీఘడ్: రెండు సార్లు పంజాబ్ సీఎంగా చేసిన అమరీందర్ సింగ్.. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో వెనుకంజలో ఉన్నారు. పాటియాలా అర్బన్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక శిరోమనీ అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా లంబీ స్థానం నుంచి వెనకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి గుర్మీత్ సింగ్ కుదియాన్ ఆధిక్యంలో ఉన్నారు.
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. చామ్కౌర్ సాహిబ్, బహదూర్ అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీలో నిలుచున్నారు. అయితే ఆ రెండు స్థానాల నుంచి పంజాబ్ సీఎం చన్నీ వెనుకంలో ఉన్నారు. ఇక అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన నవజ్యోత్ సింగ్ సిద్దూ, సాద్ నేత బిక్రమ్ మజితా వెనుకంలో ఉన్నారు. భటిండా అర్బన్ నుంచి ఆర్థిక మంత్రి మన్ప్రీత్ బాదల్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి.
పంజాబ్లో సెన్షేషన్ విక్టరీ కొట్టేందుకు ఆమ్ ఫ్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నది. 117 స్థానాలకు గాను ఆ పార్టీ ఇప్పటికే 88 స్థానాల్లో లీడింగ్లో ఉంది. భగవత్ మాన్ సింగ్ సీఎం అభ్యర్థిగా పంజాబ్లో పోటీ చేశారు. ఢిల్లీ తర్వాత ఆప్ ఖాతాలో వెళ్లనున్న రెండవ రాష్ట్రంగా పంజాబ్ నిలువనున్నది.