Punjab Polls: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చినా సీఎం అభ్యర్ధిపై కాంగ్రెస్లో రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిని పంజాబీలే నిర్ణయిస్తారని, హైకమాండ్ నిర్ణయించదని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యలకు సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్ధి పేరును ప్రకటిస్తుందని సిద్ధూ వ్యాఖ్యలకు భిన్నంగా చన్నీ ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్ధిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ను ప్రకటించగా తాము విజయం సాధించామని, అంతకుముందు ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిని తాము ప్రకటించని సందర్భంలో ఓటమి చవిచూశామని చన్నీ గుర్తుచేశారు.
ఈసారి అధిష్టానం ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్ధిని వెల్లడిస్తుందని చెప్పారు. సిద్ధూ సైతం ఇదే ఉద్దేశంతో మాట్లాడారని స్ధానిక టీవీ చానెల్తో మాట్లాడుతూ చెప్పారు. కాగా పంజాబ్ సీఎం అభ్యర్ధిపై సిద్ధూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్ధిని పంజాబ్ ప్రజలు నిర్ణయిస్తారని, పార్టీ అధిష్టానం సీఎం పేరును ప్రకటిస్తుందని మీకు ఎవరు చెప్పారని సిద్ధూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.