Chandrayan-3 | చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అయితే, పలుసార్లు మేల్కోలిపేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తయ్యినట్లేనని శాస్త్రవేత్తులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 3న ప్రజ్ఞాన్ రోవర్, 4న విక్రమ్ ల్యాండర్ను స్లీప్ మోడల్లోకి పంపింది. అంతకుముందు ChaSTE, RAMBHA-LP, ఇల్సా పేలోడ్తో ప్రయోగాలు చేపట్టింది.
చంద్రుడిపై చీకట్లు కమ్ముకోవడంతో వాటిని స్లీప్ మోడల్లోకి పంపి రిసివర్లను మాత్రం ఇస్రో ఆన్లో ఉంచింది. సెస్టెంబర్ 22 వరకు మళ్లీ ల్యాండర్, రోవర్ను మేల్కొనే అవకాశం ఉంటుందని ఇస్రో భావించినా.. ఇప్పటి వరకు స్పందించలేదు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిందని, సూర్యోదయం తర్వాత సోలార్ ప్యానల్స్ పని చేసేలా రిసీవర్లను ఆన్లో ఉంచినట్లు ఇస్రో పేర్కొంది. రోవర్ మేల్కొనపోతే ఏం జరుగుబోతుందనే విషయాన్ని ఇస్రో తెలిపింది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే చంద్రుడిపైకి ఇస్రో పంపిన గుర్తుగా మిగిలిపోతుందని పేర్కొంది. వాస్తవానికి ఇస్రో చంద్రుడిపై కేవలం ఒకేరోజు మాత్రమే పని చేసేలా రూపొందించింది.
అయితే, చంద్రుడిపై చీకటిపడానికి కొంత సమయానికి ముందే ల్యాండర్, రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపింది. ప్రజ్ఞాన్ రోవర్ సెప్టెంబర్ 2 నాటికి 100 మీటర్ల కంటే ఎక్కువ ప్రయాణాన్ని పూర్తి చేసింది. అయితే, చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం జరిగితే.. ల్యాండర్, రోవర్ను మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందని, చివరి వరకు ప్రయత్నాలు చేస్తామని ఇస్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రయత్నాలు ఫలించి మేల్కొంటే మరోసారి విజయవంతంగా ప్రయోగాలు చేపట్టవచ్చని చెబుతున్నారు. జులైలో 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 రాకెట్.. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండైన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.