న్యూఢిల్లీ, ఆగస్టు 27: చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి తీర్మానం చేయాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
జిహాదీ భావజాలం కలిగిన వ్యక్తులు చంద్రుడిపైకి వెళ్లకముందే, చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటిస్తూ భారత పార్లమెంట్ తీర్మానం చేయాలని, ఐక్యరాజ్యసమితి సైతం దీనిపై ఓ ప్రకటన చేయాలని చక్రపాణి కోరటం చర్చనీయాంశంగా మారింది.