చండీగఢ్: ఇటీవల వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. గత నెల 30న భారీ హైడ్రామా మధ్య జరిగిన మేయర్ ఎన్నికలో ప్రిసైడింగ్ అధికారి విజేతగా ప్రకటించిన బీజేపీ నేత మనోజ్ సోన్కర్ ఆదివారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. చండీగఢ్ మేయర్ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేయనున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకొన్నది. ఢిల్లీలో సమావేశం తర్వాత పార్టీ అగ్రనేతల సూచన మేరకు ఈ నిర్ణయం జరిగినట్టు తెలుస్తున్నది. మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.