చండీగఢ్: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో టీం ఇండియా విజయం సాధించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ను (IND vs AUS ) ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆటో డ్రైవర్ ఉచిత హామీ ప్రకటించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలిస్తే ఐదు రోజులపాటు ప్రయాణికులకు ఉచితంగా రైడ్ ఇస్తానని చెప్పాడు. ఈ హామీతో కూడిన పోస్టర్ను ఆటోకు అంటించాడు.
కాగా, చండీగఢ్కు చెందిన అనిల్ కుమార్ గత 12 ఏళ్లుగా ఆటో నడిపి జీవిస్తున్నాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ పోటీల సందర్భంగా భారత్ గెలిస్తే ఒక రోజు ఆటోలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటి వరకు హామీ ఇచ్చాడు. టీం ఇండియా గెలిచినప్పుడల్లా దీనిని అమలు చేశాడు. అయితే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇండియా జట్టు గెలిస్తే ఐదు రోజుల పాటు ఉచితంగా తన ఆటోలో రైడ్ చేయవచ్చని తాజాగా ప్రకటించాడు. అలాగే భారత్ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మరోవైపు పంజాబ్లో ఆదివారం జరిగిన పెళ్లి వేదిక వద్ద పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ వివాహానికి హాజరైన అతిథులు ఒక వైపు పెళ్లి తంతుతోపాటు మరోవైపు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ చూసి ఆనందించారు.
#WATCH | Chandigarh: Auto driver Anil Kumar says, “Our team is performing well. I will offer free rides for 5 days. India will win today…” pic.twitter.com/bdSqBQEBIT
— ANI (@ANI) November 19, 2023
Meanwhile, wedding scenes in Punjab on the day of the World Cup Final between India & Australia. The DJ streamed the match on the big screen. #INDvsAUS #WorldCup2023Final #WorldcupFinal pic.twitter.com/ZOWFW9FBSS
— Gagandeep Singh (@Gagan4344) November 19, 2023