Auto Fare | దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై అంటే జీవన వ్యయం చాలా కాస్ట్ లీ అని అంతా అనుకుంటారు. కానీ ఇతర నగరాలతో పోలిస్తే ముంబై బెటర్ అన్న అభిప్రాయం అనిపిస్తుంది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థ సీఈఓ.. సిలికాన్ వ్యాలీ ఇండియా పేరొందిన బెంగళూరులో కేవలం 500 మీటర్ల దూరానికే రూ.100 ఆటో చార్జీ పే చేసిన ఘటన వెలుగు చూసింది. న్యూరల్ గ్యారేజ్ కో ఫౌండర్ కం సీఈఓ మందార్ నటేకర్ ముంబైలో 500 మీటర్లకు కేవలం రూ.9 ఆటో ఫేర్ అని చెప్పారు.
మందార్ నటేకర్.. బెంగళూరులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్’లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటోలో ఏర్పాటు చేసిన మీటర్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక దాన్ని ఆటో డ్రైవర్లు ఎప్పుడూ వినియోగించరు. కానీ నేను 500 మీటర్ల ప్రయాణానికి రూ.100 పే చేశా.. ముంబైలో ఇదే దూరానికి రూ.9 చెల్లిస్తే సరిపోతుంది` అని ట్వీట్ చేశారు.
బెంగళూరు మాత్రమే కాదు ముంబై నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందంటూ టీవీఎఫ్ ప్రెసిడెంట్ విజయ్ కోషి పోస్ట్ చేశారు. చెన్నైలో ఇంకా ఇబ్బందిగా ఉంటుందన్నారు. విజయ్ కోషి పోస్టుపై మందార్ నటేకర్ ప్రతిస్పందిస్తూ.. ఎవరూ పట్టించుకోనందువల్లే ఈ తరహా దోపిడీని ఎవరూ అడ్డుకోవడం లేదని ట్వీట్ చేశారు. గతేడాది తొలి రెండు కి.మీ లకు ఆటో ఫేర్ రూ.25 నుంచి రూ.30 వేలకు. తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ.15 చెల్లించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.