శ్రీనగర్/మండి, సెప్టెంబర్ 13: అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని యాపిల్ రైతులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారిని మరింత కష్టాల్లోకి నెడుతారా? అని మోదీ సర్కార్ తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
టారిఫ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాను శాంతింపజేసేందుకు, దేశంలోని యాపిల్ రైతులను నాశనం చేయాలని అనుకొంటున్నదా? అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. దేశంలో యాపిల్స్ కొరత లేదని, జమ్ముకశ్మీర్, హిమాచల్లో నాణ్యమైన యాపిల్స్ పండుతాయని, అలాంటప్పుడు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదని పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రశ్నించారు. దేశంలోని యాపిల్ రైతులు ఇబ్బందులు పడుతుంటే, ధరల విషయంలో వారికి అండగా ఉండాల్సింది పోయి, ఇవేం నిర్ణయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కేంద్రాన్ని నిలదీశారు.