న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలో 2021లో ప్రతి రోజూ సగటున 115 దినసరి కూలీలు, 63 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకొన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మొత్తంగా ఒక్క ఏడాదిలో 1,64,033 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు మంగళవారం లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. వివిధ వర్గాల ప్రజల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) సేకరించిన డాటాను మంత్రి సభ ముందు ఉంచారు.