న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కొవోవాక్స్ వ్యాక్సిన్ను భిన్నమైన బూస్టర్ డోసుగా పెద్దలకు ఇవ్వడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆమోదించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకుగానూ త్వరలోనే కొవిన్ పోర్టల్లో కొవోవాక్స్ను చేర్చనున్నారు.
ఒక్కో డోసు రూ.225+జీఎస్టీతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. ఇంతకుముందు కొవిషీల్డ్, కొవాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఇప్పుడు బూస్టర్ డోసుగా కొవోవాక్స్ తీసుకోవచ్చు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ నుంచి సాంకేతికతను పొంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్నది.