న్యూఢిల్లీ: విదేశాల్లో ఏకధాటిగా రెండు సంవత్సరాలు గడిపి భారత్కు తిరిగి వచ్చేవారు తమ వెంట రెండు పెంపుడు జంతువులను తెచ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
బ్యాగేజీ నిబంధనల ప్రకారం కుక్కలు, పిల్లులను మాత్రమే తరలించేందుకు అనుమతినిస్తామని డీజీఎఫ్టీ మంగళవారం తెలిపింది. రెండు కన్నా ఎక్కువ జంతువులను దిగుమతి చేసుకోవాలనకునేవారు అనుమతి తీసుకోవాలని పేర్కొంది.