న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లలిత తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫై చేసింది. అలాగే రెండు హైకోర్టులకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. పంజాబ్ హైకోర్టుకు ఐదుగురు, రాజస్థాన్ హైకోర్టుకు ఇద్దరు జడ్జిలు నియమితులయ్యారు. ఈ ఏడుగురూ న్యాయవాదులుగా పనిచేస్తున్నవారే. కాగా, తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ లలిత.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2020 మే 2న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.