న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: న్యూఢిల్లీ: వివాదాస్పద ఐటీ నిబంధనలు-2021ను కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది. దీని ప్రకారం.. ఫేక్న్యూస్ అని కేంద్ర ప్రభుత్వ అధీకృత ఫ్యాక్ట్చెక్ సంస్థలు నిర్ధారించిన కంటెంట్ను గూగుల్, ఫేస్బుక్ వంటి ఇంటర్నెట్ సంస్థలు తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే చట్టపరంగా వాటికి కల్పిస్తున్న రక్షణను తొలగిస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్కుమార్ హెచ్చరించారు.
ఈ నిబంధనలపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని డిజిటల్ రైట్స్ గ్రూప్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ పేర్కొన్నది.