న్యూఢిల్లీ, జూలై 25: 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ రేట్లను 78 సార్లు, డీజిల్ రేట్లను 76 సార్లు పెంచారు. ఈ మేరకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. దీనిపై చద్ధా ట్విట్టర్లో మండిపడ్డారు. సామాన్యులను కేంద్రం ఏ విధంగా లూటీ చేస్తున్నదో పార్లమెంట్ సాక్షిగా యావత్తు జాతికి తెలిసొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.