న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఉపాధి హామీ కార్మికులకు ఆధార్ ఆధారిత వేతన చెల్లింపుల వ్యవస్థను (ఏబీపీఎస్) సెప్టెంబర్ 1 నుంచి తీసుకొస్తామన్న కేంద్రం.. వెనకడుగు వేసింది. కోట్లాది మంది ఉపాధి కార్మికులు నష్టపోతారన్న విమర్శలు వెల్లువెత్తటంతో.. ఏబీపీఎస్ వ్యవస్థ అమలు గడువును డిసెంబర్ 31కి పెంచుతూ కేంద్రం బుధవారం కీలక ప్రకటన జారీచేసింది. ఏబీపీఎస్ను కారణంగా చూపి జాబ్ కార్డులను తొలగించబోమని స్పష్టం చేసింది.
‘ఏబీపీఎస్పై సమీక్ష చేశాక గడువు పెంచాలని నిర్ణయించాం. అనేక సందర్భాల్లో లబ్దిదారుడి బ్యాంక్ ఖాతా నంబర్లు మారిపోవటం, సంబంధిత ప్రోగ్రాం అధికారి వాటిని పథకంతో అనుసంధానం చేయకపోవటంతో సమస్యలు తలెత్తాయి. తుది ఉత్తర్వులు జారీ అయ్యే వరకు మిశ్రమ (నాచ్, ఏబీపీఎస్) పద్ధతుల్లో వేతన చెల్లింపులు చేపడతాం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.