కోల్కతా: ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్ను తిరస్కరించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే హోదాకు అనుగుణంగా ఆ కార్యక్రమం జరుగడం లేదని పేర్కొంది.
అక్టోబర్లో మదర్ థెరిస్సా నేపథ్యంలో ఇటలీలో ప్రపంచ శాంతి సమావేశం జరుగనున్నది. కార్యక్రమ నిర్వాహకులు మమతను ఆహ్వానించారు. అయితే ప్రతినిధులతో కలిసి రావద్దని ఇటలీ ప్రభుత్వం ఇటీవల మమతను కోరింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ ప్రతినిధి క్లియరెన్స్ను సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీని కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆమె అభ్యర్థించారు. అయితే ఆ అనుమతిని కేంద్రం నిరాకరించింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీరుపై టీఎంసీ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచార్య మండిపట్టారు. గతంలో మమత చైనా టూర్ను కేంద్రం రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ సంబంధాలు, భారత దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానికి తాము అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పుడు మమత ఇటలీ టూర్ను ఎందుకు రద్దు చేశారు మోడీ జీ? అని ట్విట్టర్లో ఆయన ప్రశ్నించారు. బెంగాల్తో మీకు సమస్య ఏమిటి? అని నిలదీశారు.