Ransomware| న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఇంటర్నెట్ యూజర్లకు హెచ్చరిక చేసింది. ‘అకీరా’గా పిలుస్తున్న కొత్త ర్యాన్సమ్వేర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ కేటుగాళ్లు ఈ వైరస్ ద్వారా ఇంటర్నెట్ యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఎన్క్రిప్టెడ్ డాటాను తస్కరించి డబ్బులు గుంజే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. విండోస్, లినక్స్ సిస్టమ్స్ను ఈ ర్యాన్సమ్వేర్ లక్ష్యంగా చేసుకుంటున్నట్టు వెల్లడించింది. యూజర్లు డబ్బులు చెల్లించకపోతే, సైబర్ నేరగాళ్లు వారి డాటాను డార్క్ వెబ్లో విక్రయానికి ఉంచుతున్నట్టు తెలిపింది.
సైబర్ మోసాలు, దాడుల గురించి సెర్ట్ఇన్ ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూ ఉంటుంది. ర్యాన్సమ్వేర్ అనేది కంప్యూటర్ మాల్వేర్. దీని ద్వారా సైబర్ కేటుగాళ్లు యూజర్ల కంప్యూటర్లపై దాడి చేసి సిస్టమ్ను, డాటాను వాడకుండా బ్లాక్ చేస్తారు. అనంతరం యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసి సిస్టమ్ పనిచేసేలా చేస్తారు.