న్యూఢిల్లీ: వేర్పాటువాది షాబిర్ అహ్మద్ షా నేతృత్వంలోని జమ్ముకశ్మీరు ప్రజాస్వామిక స్వతంత్ర పార్టీపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ పార్టీ భారత వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతున్నదని గురువారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఈ ఆదేశాలిచ్చింది. ఈ పార్టీని షా 1998లో ఏర్పాటు చేశారు. వేర్పాటువాదుల కూటమి హురియత్ కాన్ఫరెన్స్లో ఈ పార్టీ భాగస్వామి. ఆయన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.