న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో స్నాప్చాట్ సహా 15 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. సమాచార, సాంకేతిక చట్టం- 2000లోని 69ఏ సెక్షన్ ప్రకారం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. జమ్ముకశ్మీర్ వరకే ఈ నిషేధం అమలవనున్నది. జమ్ముకశ్మీర్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నట్టు నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. ఈ యాప్స్ ద్వారా ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి సందేశాలను అందుకుంటూ, ఇక్కడి సమాచారాన్ని అక్కడికి చేరవేస్తున్నట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాలకు సాయమందిస్తున్న వారికి ద్వారానే సందేశాలను పంపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.