న్యూఢిల్లీ, అక్టోబర్ 3: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్ శాటిలైట్ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫాంలు, న్యూస్ వెబ్సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. బెట్టింగ్ ప్లాట్ఫాంలు, వాటి అనుబంధ వెబ్సైట్లకు సంబంధించిన ప్రకటనలను ఏ రూపంలోనూ ప్రసారం చేయొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు గట్టిగా సూచించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.